News April 24, 2025

అంబేడ్కర్ కోనసీమ: ఆలోచింప చేస్తున్న చిత్రం

image

చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అంతా సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారు. తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశలో సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. టీచర్స్, పేరెంట్స్‌ను సైతం లెక్కచేయక తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. బుధవారం సెల్‌ఫోన్‌కు బానిసగా బారిన స్టూడెంట్ టీచర్‌పై చేయిచేసుకుంది. దీనిపై కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు అంజి ఆకొండి గీసిన చిత్రం ప్రజలను ఆలోచింపజేస్తోంది.

Similar News

News April 24, 2025

పహల్గామ్ బాధితులకు ఫ్రీ ట్రీట్‌మెంట్: అంబానీ

image

పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడినవారికి ముంబైలోని సర్ హెచ్ఎన్ ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఉగ్రదాడి మానవాళికే మచ్చ. అది ఏ రూపంలో ఉన్నా సహించకూడదు. ప్రాణాలు కోల్పోయినవారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం తరఫున అంబానీ కుటుంబం ఎప్పుడూ నిల్చునే ఉంటుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.

News April 24, 2025

నిర్మల్: ‘చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించుకోవాలి’

image

చెక్ బౌన్స్ కేసులను రాజీ పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాంకు అధికారులతో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు.జిల్లాలోని బ్యాంకులు, చిట్ ఫండ్స్‌లలో నమోదై, పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గాన పరిష్కరించుకోవాలని సూచించారు.

News April 24, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం బుడగట్లపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ఏర్పాటు, గ్రామ సభ వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ విధుల అమలుపై ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. 

error: Content is protected !!