News April 9, 2025
అంబేడ్కర్ కోనసీమ: తల్లిని చూసేందుకు వెళ్తూ మృత్యు ఒడిలోకి

తల్లిని చూసేందుకు బైక్పై వెళ్తూండగా టిప్పర్ ఢీ కొట్టడంతో తాళ్లపూడి M గజ్జరానికి చెందిన కడలి గోవింద్ (44) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆత్రేయపురం M మెర్లపాలెంలో మంగళవారం జరిగింది. బైక్పై వెళ్తున్న గోవిందును టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టిందని ఎస్సై రాము తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యవసాయం చేసుకునే గోవిందు తల్లిని చూడ్డానికి వెళ్తూ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.
Similar News
News December 2, 2025
‘నువ్వు నాకేం ఇస్తావ్.. నేను నీకేం ఇవ్వాలి’

1ST ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో లాస్ట్. 398 GPలకు ఎన్నికలు జరుగుతుండగా 43 పంచాయతీలకు 3లోపే నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామపెద్దలు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీమైతే ప్రభుత్వం ఇచ్చే నజరానాతోపాటు ఎన్నికలకయ్యే ఖర్చు తగ్గుతుందంటూ సర్పంచ్ అభ్యర్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు లక్షల్లో డిమాండ్ చేస్తూ వేలంపాటలకు సై అంటున్నారు.
News December 2, 2025
విశాఖలో చేనేత వస్త్రాలు, హస్త కళల ప్రదర్శన ప్రారంభం

విశాఖలో ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ సాంప్రదాయ, చేనేత వస్త్రాలను, హస్త కళల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హోటల్ గ్రీన్ పార్క్లో సోమవారం ఈ ప్రదర్శనను CMR అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మల్లిక్ కంకటాల, చందు తిప్పల ప్రారంభించారు. కార్యక్రమంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ బుక్లెట్ను విడుదల చేశారు. ప్రదర్శనలో కొల్హాపురి పాదరక్షలు, కలంకారి హ్యాండ్ పెయింటింగ్ లైవ్ క్రాఫ్ట్ డెమో అందరినీ ఆకట్టుకున్నాయి.
News December 2, 2025
విశాఖలో రెండు రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శన

విశాఖలో 2 రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శనను క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారు. హోటల్ గ్రీన్ పార్క్లో డిసెంబర్ 1, 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రదర్శన జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి వివిధ రకాల ఆధునిక నేత వస్త్రాలు, చేనేత హస్తకళల ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భారతీయ కళాకారులు, నేతదారుల ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.


