News February 15, 2025
అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
NARFBRలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ( NARFBR)7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS, PhD, B.V.Sc&AH, MVSc, ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC/ST/Women/PWD/EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://narfbr.org/
News November 27, 2025
ఆదిలాబాద్: సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవ తీర్మాణం

ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సర్పంచ్తో పాటు 8 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్ పరిధిలోని సాలెగూడ, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పటేల్ల ఆధ్వర్యంలో సమావేశమై, కోవా రాజేశ్వర్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 27, 2025
BREAKING: సత్యసాయి జిల్లాలో బాలుడి హత్య

తలుపుల మండల పరిధిలోని గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నంబులపూలకుంట(M) గౌకన పేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


