News February 15, 2025

అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 14, 2025

హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

రిజర్వ్ బ్యాంక్ రెపో <<17882889>>రేట్‌ను<<>> 5.50శాతంగా కొనసాగించడంతో HDFC, BOB, ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంకు MCLR రేట్లను తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్లపై EMI తగ్గింది. టెన్యూర్‌ను బట్టి BOBలో కనిష్ఠంగా 7.85శాతం, గరిష్ఠంగా 8.75శాతం, IDBIలో 8-9.70శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.95-8.85శాతం, HDFCలో 8.4-8.65 శాతం వరకు లోన్లు లభిస్తున్నాయి. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

News October 14, 2025

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవు

image

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. మద్యం టెండర్ల దాఖలు కోసం మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వైన్ షాపులకు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పోటీ ఉండేది. కానీ రియల్ ఎస్టేట్ ప్రభావం వైన్స్ టెండర్లపై పడింది.

News October 14, 2025

గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.