News February 15, 2025
అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
శ్రీకాకుళంలో 104 ఉద్యోగులు నిరసన

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది వేతన సమస్యలు, గ్రాట్యువిటీ, ఎర్న్డ్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిలో ఆందోళన నెలకొందని యూనియన్ నేతలు పేర్కొన్నారు.
News December 7, 2025
KNR: ఎమ్మెల్యేలూ.. నియోజకవర్గాలు విడిచి వెళ్లొద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేవరకు MLAలు నియోజకవర్గాలు వదిలి బయటకు రావద్దని PCC ఆదేశించినట్లు తెలుస్తోంది. గెలిచిన సర్పంచి స్థానాలను బట్టే MLAల పనితీరుకు గ్రేడింగ్ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో MLAలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రతి గ్రామం విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిపించి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టాలని ఉమ్మడి జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.
News December 7, 2025
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తోట నవీన్ ఖరారు..?

కాకినాడ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా తోట నవీన్ పేరు ఖరారైనట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తోట నవీన్ మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఎంపీ సానా సతీశ్ బాబు సిఫార్సుతో అధిష్ఠానం తోట నవీన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


