News February 3, 2025
అంబేడ్కర్ స్టేడియంలో పోలీసు క్రీడలు ప్రారంభం

పోలీసు ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడితో కూడుకుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాలోని వివిధ శాఖలకు, యువతకు నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎస్పీ జిల్లా అటవీ శాఖ అధికారి, ఎం.నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొని, పోలీసు క్రీడలను ప్రారంభించారు.
Similar News
News October 20, 2025
సీఎం రేవంత్తో కొండా సురేఖ దంపతుల భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
News October 20, 2025
గుంజేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకట్ట సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణ బైకుపై స్వగ్రామానికి వెళ్తూ జేసీబీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడికి వెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందారు. ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.
News October 20, 2025
తిరుపతి రైల్వే స్టేషన్లో నకిలీ టీటీ.!

తిరుపతి రైల్వే స్టేషన్లో టికెట్ పరిశీలకుడిగా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులను మోసంచేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే భద్రతాదళం, GRP పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. రైల్వే సిబ్బంది గేట్ నంబర్ 3 వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకోవడం గమనించారు. చెకింగ్ ఇన్స్పెక్టర్ అనిచెప్పి రూ.1000 అడుగుతుండగా నకిలీ వ్యక్తిని వారు పట్టుకున్నారు.