News April 14, 2025
అంబేద్కర్కి ఎస్పీ ఘన నివాళి

అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. రాయచోటి ఎస్పీ ఆఫీసులో అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు లర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకం అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగిన మహనీయుడు అన్నారు.
Similar News
News April 24, 2025
కొండాపూర్: మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

జిల్లాలో ఈనెల 27న నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. http://telanganams.cgg.gov.in అనే వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News April 24, 2025
MNCL: ‘రెడ్డి సంక్షేమ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేస్తాం’

రెడ్డి సంక్షేమ సంఘాన్ని మంచిర్యాల జిల్లాలో బలోపేతం చేస్తామని రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన కొంగల తిరుపతిరెడ్డిని, జిల్లా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నియమించినట్లు వారు తెలిపారు. వారికి నియామక పత్రాన్ని అందించారు. రెడ్డి నాయకులు అంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు.
News April 24, 2025
నిర్మల్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

నిర్మల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.బట్టు విజయ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో B.Sc, B.Com, BBA, BA విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మే 5 లోపు కళాశాలకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.