News April 9, 2025

అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. యువకుడికి అధికారుల షాక్

image

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్‌లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Similar News

News December 4, 2025

దేశ సేవలో అన్నదమ్ములు..

image

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్‌లో, అబ్దుల్ నబీ హిమాచల్‌ప్రదేశ్‌లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.

News December 4, 2025

పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

image

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్‌లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.

News December 4, 2025

ఇసుక మాఫియా ఒత్తిడికి అధికారుల దాసోహం

image

పనులు నడుస్తున్నాయో లేదో తెలుసుకోకుండానే నిలిచిపోయిన పనుల పేరిట ఇసుక రవాణాకు అధికారులు అనుమతిస్తున్నారు. వేములవాడ ZP బాలికల హై స్కూల్ ఆవరణలో కంప్యూటర్ గది, లైబ్రరీ నిర్మాణం పనులు మూడు నెలల కింద ఆగిపోయినప్పటికీ తాజాగా 16 ట్రిప్పుల ఇసుకకు తహశీల్దార్ అనుమతి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. వాస్తవాలు పరిశీలించకుండానే ఇసుక మాఫియా ఒత్తిడికి, ముడుపులకు ఆఫీసర్లు తలొగ్గి అనుమతులిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.