News September 25, 2024

అక్టోబ‌రు 13న విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ప్రారంభ ర్యాలీ

image

అక్టోబ‌రు 13న విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ప్రారంభ ర్యాలీని శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుంచి ప్రారంభించి, అయోద్యా మైదానం వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ ర్యాలీని వివిధ జాన‌ప‌ద క‌ళారూపాల‌తో సుమారు 15వేల మందితో గొప్ప‌గా నిర్వ‌హించాల‌న్నారు. 13,14 తేదీల్లో 2 రోజులు సాయంత్రం మెగా క‌ల్చ‌ర‌ల్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ స‌మావేశంలో జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్‌ పాల్గొన్నారు.

Similar News

News July 7, 2025

VZM: నేడు చిత్రలేఖనం పోటీలు

image

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహిస్తున్నామని డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. నేడు మండల స్థాయిలో, ఈనెల 9న జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పొగాకు, మత్తు పదార్థాల వినియోగంపై చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు.

News July 6, 2025

భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

image

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.

News July 6, 2025

జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

image

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.