News August 20, 2024
అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం: కలెక్టర్
నంద్యాల జిల్లాలో అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లను సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పుల సవరణలను ఏఈఆర్వోలు, ఈఆర్వోలు స్వయంగా పరిశీలించాలన్నారు.
Similar News
News October 7, 2024
కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?
కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News October 7, 2024
నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా
నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.
News October 7, 2024
డోన్: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
డోన్లోని కొండపేట వాసి షేక్ మదార్వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.