News March 14, 2025
అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదలలో అక్రమాలకు పాల్పడకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 26, 2025
ఆదోనిలో యువకుడి బలవన్మరణం

ఆదోనికి చెందిన 21ఏళ్ల యువకుడు ఉదయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. కార్వన్పేటలో నివాసం ఉంటున్న యువకుడు బేల్దారిగా పనిచేస్తున్నారు. తన సంపాదనతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఈక్రమంలో నిన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 26, 2025
పత్తికొండ వాసి రామ్మోహన్కు సేవా పురస్కారం

పత్తికొండకు చెందిన కేపీఆర్ మైత్రి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్మోహన్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు, నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ అచీవర్స్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.
News March 25, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు
➤ బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ
➤ నవోదయ ఫలితాల్లో ఆస్పరిలో బార్బర్ కొడుకు ప్రతిభ
➤ ఆలూరు: వంట గ్యాస్ సిలిండర్ పేలి గాయపడ్డ వ్యక్తి మృతి
➤ శ్రీశైలం మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం
➤ సీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్
➤ నందవరంలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్
➤ ఎమ్మిగనూరులో 27న జాబ్ మేళా
➤కోసిగిలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి