News March 25, 2025
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

టీడీపీ నేతల దురాగతాలకు తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆయన.. YCP కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్పై ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు తాము భయపడమని, తాము తిరగబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News April 1, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News March 31, 2025
నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.
News March 31, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.