News April 6, 2024

అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టండి: ఎస్పీ

image

అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బోర్డర్ చెక్ పోస్టులలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయాలని అన్నారు. నంద్యాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు.

Similar News

News January 18, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ-దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి వెల్లడించారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News January 17, 2025

‘ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదు’

image

విజయ డెయిరీలో అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వర్గీయులు పాల ఉత్పత్తి కర్మాగారం వద్ద దౌర్జన్యం చేసి నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. దౌర్జన్యాలకు దిగి ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఎన్నికలకు విలువ లేకుండా పోతుందన్నారు.

News January 17, 2025

‘చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ’

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షనీయమని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు  నాయకత్వంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం జీవం పోసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ కృషి చేసిందన్నారు.