News August 20, 2024
అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు: కమీషనర్

రాజంపేట పట్టణ పరిధిలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని, రాజంపేట మున్సిపల్ కమీషనర్ రాంబాబు హెచ్చరించారు. పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1262, 1263, 1264లలో 2.61 విస్తీర్ణంలో వేసిన ప్లాట్లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. ఈ ప్లాట్లకు అమ్మకం,కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ జరగదని తెలిపారు. భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వరని వివరించారు. మౌలిక వసతులు కల్పించబోమని అన్నారు.
Similar News
News November 1, 2025
కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
News November 1, 2025
హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..!

ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 1, 2025
ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీపై DLCO విచారణ..!

ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీ పాలకవర్గం చర్యలపై DLCO సత్యానంద్ శనివారం విచారణ చేపట్టారు. సొసైటీ పాలకవర్గం, సబ్ రిజిస్ట్రార్ కలిసి NOC లెటర్ పేరుతో సాగించిన అన్యాయాలపై దుమారం చెలరేగడంతో DLCO విచారణ చేపట్టారు. సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి విష్ణులను DLCO తన కార్యాలయానికి పిలిపించి NOCలపై విచారించారు. సంబంధిత రికార్డులను తెప్పించుకొని, NOC లెటర్ల చట్టబద్ధతపై విచారిస్తున్నారు.


