News July 18, 2024

అగనంపూడి వద్ద మళ్లీ టోల్‌గేట్ ఏర్పాటు ?

image

అగనంపూడి వద్ద టోల్‌గేట్ మళ్లీ ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ టోల్‌గేట్‌ని తొలగించాలంటూ స్థానికులు కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా టోల్ వసూలుకు టెండర్‌లను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. ఏడాదికి రూ.81 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 25, 2025

విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

News October 25, 2025

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

image

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News October 25, 2025

విశాఖలో సీఐల బదిలీ: సీపీ

image

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్‌కు, సీసీఎస్‌లో ఉన్న సీఐ శంకర్‌నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్‌కు, రేంజ్‌లో ఉన్న వరప్రసాద్‌ను వన్‌టౌన్ స్టేషన్‌కు, సీపోర్టు ఇమిగ్రేషన్‌లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్‌కు, సిటీ వీఆర్‌లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు.