News April 6, 2024

అగ్నిప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తినష్టం

image

నందవరం మండలం కొత్త నదికైరవాడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాశి అనే రైతు గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం కాశీ భార్య ఈరమ్మ, పిల్లలు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారి సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, ఫ్రిజ్, సామగ్రి మంటల్లో కాలిపోయిందని బాధితులు తెలిపారు.

Similar News

News January 16, 2025

ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!

image

ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 20మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆదోని MLA పార్థసారథి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ నెల 19న విజయవాడలో నిర్వహించే సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

News January 16, 2025

కర్నూలు జిల్లాలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!

image

కర్నూలు జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కర్నూలులో కాంపోజిట్ ఫెసిలిటీపై రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే సుమారు 6వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

News January 16, 2025

డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని

image

YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.