News April 3, 2025
అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్తో మంటలను అదుపు చేశామన్నారు.
Similar News
News December 2, 2025
ఖమ్మం: ఏఎన్ఎం కోర్సు ప్రవేశాలకు నేడే ఆఖరు

ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళా)/ఏఎన్ఎం కోర్సు ప్రవేశాలకు మంగళవారం చివరి గడువు అని మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ఉచిత శిక్షణలో బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 76600 22512ను సంప్రదించవచ్చు.
News December 2, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో Dy.CM భట్టి విక్రమార్క పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
News December 1, 2025
కామేపల్లిలో రెండో రోజు 169 నామినేషన్లు దాఖలు

కామేపల్లి మండలంలో రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 39, వార్డు స్థానాలకు 130 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో జి. రవీందర్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మండలంలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 49, వార్డు స్థానాలకు 142 దరఖాస్తులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతున్నట్లు, లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


