News April 3, 2025
అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి

అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం టిడి బంజరలో షార్ట్ సర్క్యూట్ కారణంగా <<15975525>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఓ ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) మంటలు అంటుకొని సజీవదహనం అయ్యాడని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. పంచాయతీ ట్రాక్టర్తో మంటలను అదుపు చేశామన్నారు.
Similar News
News April 12, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి

TG: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసుల నుంచి అనుమతి పత్రాలు అందుకున్నారు. రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
News April 12, 2025
గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా?

AP: ఆధార్/రేషన్కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్లో దీపం-2 డ్యాష్బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
News April 12, 2025
దీపం-2 డ్యాష్బోర్డు ఎలా పనిచేస్తుంది?

✒ https://epds2.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీపం-2 డ్యాష్ బోర్డు కనిపిస్తుంది.
✒ KNOW YOUR DEEPAM2 STATUSపై క్లిక్ చేసి రేషన్ కార్డు లేదా ఎల్పీజీ నంబర్ ఎంటర్ చేయాలి.
✒ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే దీపం-2 ఎలిజిబిలిటీ స్టేటస్, సబ్సిడీ జమ వివరాలు కనిపిస్తాయి.
✒ ఏదైనా సమస్య ఉంటే దానికి గల కారణాలు తెలుస్తాయి.
✒ NOTE: ఈ డ్యాష్బోర్డు అందుబాటులోకి వచ్చాక ఆప్షన్లు కనిపిస్తాయి.