News February 4, 2025
అగ్ని ప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే

ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆర్డీవోను కోరారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మల్లయ్య, కృష్ణమూర్తి, ఐలయ్యకు చెందిన ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న డా.రాజయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Similar News
News December 16, 2025
తిరుపతి: ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలలో “గిఫ్ట్” వసూళ్లు !

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో అదనపు అంతస్తుల నిర్మాణాలకు అనుమతుల పేరిట అక్రమంగా ‘గిఫ్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. DKT భూములు మాత్రమే కాకుండా, ఇప్పటికే హ్యాబిటేషన్లుగా మారి ప్రభుత్వ సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ వసూళ్లు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి మొత్తానికి కాకుండా తక్కువ నగదుకు రసీదులు ఇవ్వడం గత కొన్ని నెలలుగా సాగుతోందట.
News December 16, 2025
హైదరాబాద్ BDLలో 80 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో 80 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్సైట్:bdl-india.in
News December 16, 2025
చమురు కుంభకోణం కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం

1996 వన్డే ప్రపంచకప్ విన్నింగ్ జట్టు కెప్టెన్, శ్రీలంక మాజీ పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగ చమురు స్కామ్ కేసులో చిక్కుకున్నారు. చమురు కొనుగోళ్ల విధానాన్ని మార్చి ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించారనే ఆరోపణలపై అవినీతి నిరోధక సంస్థ కేసు నమోదు చేసింది. ప్రభుత్వానికి సుమారు రూ.23.5 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న ఆయనను స్వదేశానికి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు.


