News February 15, 2025

అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ

image

ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ దాడి ఘటన సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ మదనపల్లెలోని మఖాం వేశారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.

Similar News

News November 17, 2025

2026 JANలో HYD-విజయవాడ NH విస్తరణ

image

TG: HYD-విజయవాడ NH65 విస్తరణ పనులు 2026 JANలో ప్రారంభం కానున్నాయి. 6 లేన్లుగా దీని విస్తరణకు DPR ఖరారైంది. పనులకు టెండర్లనూ పిలిచారు. ఈ నెలాఖరున ఇవి ఫైనల్ అవుతాయి. దాదాపు ₹10,000 CRతో 231 KMమేర విస్తరణ చేస్తారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ROBలు, అండర్‌పాస్‌లు కూడా హైవే విస్తరణ పనులలో భాగంగా ఉంటాయి. హైవే విస్తరణలో 33 ప్రధాన జంక్షన్లు, 105 చిన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.

News November 17, 2025

యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

image

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయకుమార్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News November 17, 2025

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. గజ పటాన్ని స్వరకవచ ధ్వజస్తంభంపైకి ఎగురవేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. ముందుగా అమ్మవారి ఉత్సవర్లను ధ్వజస్తంభానికి అభిముఖంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేడితాడనం, అష్టదిక్పాల కైంకర్య ఆస్థానం నిర్వహించారు.