News January 27, 2025
అచ్చంపేటలో ఉద్రిక్తత

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అంతటి రజిత భర్త మల్లేష్ పై సోమవారం రైతులు దాడి చేశారు. అంతకంటే ముందు వ్యవసాయ మార్కెట్ను ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో అచ్చంపేటలో ఉద్రిక్తత నెలకొంది. తాము పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని వారు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై రమేష్ ఘటనా స్థలికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News February 15, 2025
మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

ఇచ్ఛాపురంలోని మండపల్లి సర్పంచ్ శశిరేఖ చెక్ పవర్ రద్దు చేసినట్లు ఎంపీడీవో రామారావు తెలిపారు. రూ. 85 లక్షల వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఎల్ పీవో గోపిబాల, ఈవోఆర్డీ ఎస్. కృష్ణ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆమె సరైన ఆధారాలు చూపకపోవడంతో చెక్ పవర్ రద్దు చేయాలని డీపీవో భారతి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
News February 15, 2025
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే: YCP

అన్నమయ్య జిల్లాలో యువతి గౌతమిపై ప్రమోన్మాది గణేశ్ యాసిడ్ దాడి రాష్ట్రంలో సంచలమైంది. ఈ ఘటనలో యువకుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. యువకుడి తండ్రి మురళికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.
News February 15, 2025
ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.