News April 4, 2025
అచ్చంపేట: ఈయన చనిపోయాడు.. గుర్తుపడితే చెప్పండి..!

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఓ గుర్తుతెలియన వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రయాణికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే అచ్చంపేట పోలీసుల నంబర్ 8712657733కు ఫోన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News November 26, 2025
MDK: ఎన్నికలకు మోగిన నగర.. అంత మీ చేతుల్లోనే

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో వరసలు కలుపుకుంటూ.. బంధాలను పెంపొందించుకుంటున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశవాహులు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మద్దతు దారులను వారు వెంటే ఉంచుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఏలా ఉంది. కామెంట్ చేయండి.
News November 26, 2025
మహదేవపూర్: SI అత్యుత్సాహం.. మహిళ ఆత్మహత్యాయత్నం?

SI ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహదేవ్పూర్(M)లో జరిగింది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన మహేశ్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. లక్ష్మారెడ్డి అనే ఓ వ్యక్తికి వీరు అప్పు ఇవ్వగా, తిరిగి డబ్బు తీసుకునే విషయంలో SI ఇన్వాల్వ్ అయ్యి వారిని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లోకి SI చొరబడి తన భార్యను బెదిరింపులకు గురిచేయడంతో పురుగు మందు తాగింది.
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.


