News March 29, 2024

అచ్చంపేట: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

అచ్చంపేట మండలంలోని దుబ్బా తండాకు చేందిన కేతవత్ జవహర్(33) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నట్లు సిద్దాపూర్ SI పవన్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాలు.. గురువారం తన వ్యవసాయ పొలంలో స్థభానికి జవహర్ ఊరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో పొలానికి వెళ్లి జవహర్ సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి భార్య కవిత ఫిర్యాదుతో నేడు కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు. 

Similar News

News January 23, 2025

కౌకుంట్ల : పేరూరులో సభ.. సద్వినియోగం చేసుకోండి

image

కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో నేడు ఉదయం 10:00 గంటలకు నిర్వహించే గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీ. మధుసుధన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ సీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ అదే పాల్గొంటారు. ఈ సభను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ బరోసా కు వినతి పత్రాలను ఇవ్వాలన్నారు.

News January 22, 2025

MBNR: ప్రజల సమస్యలు తెలుసుకోడానికే గ్రామసభలు: మంత్రి

image

భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు. ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఆయన వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

News January 22, 2025

ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అరుదైన జాతి పిల్లి మృతి

image

ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ వెళ్లే రహదారిలో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఇది గుర్తించి మొదట పులి పిల్ల అని భావించి.. దగ్గరికెళ్లేందుకు భయపడ్డారు. కొంతమంది ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూడగా అది అరుదైన జాతికి చెందిన పిల్లిగా గుర్తించారు.