News April 14, 2025
అచ్చంపేట: నల్లమలలోని ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు

నల్లమల ప్రాంతంలోని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. భక్తుల సంఖ్య, ఆదాయం పెరగడంతో మద్దిమడుగు ఉమామహేశ్వరం, సోమశిల, నాయనపల్లి మైసమ్మ, 6ఏ జాబితాలో చేర్చుతూ హోదా పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పాలెం వెంకటేశ్వర దేవాలయానికి 6బీ జాబితాలో చేర్చారు.
Similar News
News November 28, 2025
MBNR: సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నోడ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్ లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్ కు రూ.2,000) చెల్లించాలి. “Expenditure declaration” సమర్పించాలి. అవసరమైన వారికి #SHARE IT.
News November 28, 2025
GNT: కొంపముంచిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్


