News February 21, 2025

అచ్చంపేట మార్కెట్‌కు భారీ ఆదాయం

image

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు సాగుచేసిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. 7741 రైతుల నుంచి 2లక్షల11వేల834 క్వింటాళ్ల పత్తిని 3 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ వారు కొనుగోలు చేశారు. 1% శాతం మార్కెట్ ఫీజు ఆధారంగా ఒక రూ.1,55,34,554 మార్కెట్‌కు ఆదాయం వచ్చినట్లు కార్యదర్శి నరసింహులు వెల్లడించారు.

Similar News

News December 5, 2025

MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్‌లు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.

News December 5, 2025

ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్‌ఛార్జ్ PO సమావేశం

image

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్‌ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్‌లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 5, 2025

కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోండి: ఎంపీ

image

జిల్లాలో కొబ్బరి రైతులను ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ శుక్రవారం పార్లమెంటులో కోరారు. జిల్లాలో కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కొబ్బరి పంట వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు జీవనోపాధిని నిలబెట్టే సాంస్కృతిక, ఆర్థిక ఆధారాలని ఎంపీ తెలిపారు.