News March 27, 2025

అచ్చంపేట: రంజాన్ తోఫా వెనక్కి తీసుకోండి: INTUC

image

భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలను వ్యతిరేకిస్తూ, రంజాన్ తోఫా ప్రకటించడం విడ్డూరమని అచ్చంపేట INTUC తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ, విద్యా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 17, 2025

ఖమ్మం: సాయుధపోరు.. 900 మంది అమరులయ్యారు

image

రజాకార్ల అరాచకాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎదురొడ్డి నిలిచింది. సాయుధ, శాంతిపోరులో ఎంతోమంది పాల్గొన్నారు. జమలాపురం కేశవరావు రగిలించిన పోరాట స్ఫూర్తి ఎందరినో ఉద్యమం వైపు నడిపింది. జమలాపురం కేశవరావు, చిర్రావురి లక్ష్మీనర్సయ్య, మిర్యాల నారాయణగుప్తా, పైడిపల్లి హనుమయ్య, గెల్లా కేశవరావు, మంచికంటి రాంకిషన్‌రావు, లింగం గుప్తా, దాశరథి సోదరులతో పాటు మరెందరో ఉన్నారు. సుమారు 900 జిల్లా వాసులు అమరులయ్యారు.

News September 17, 2025

HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

image

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

News September 17, 2025

హత్య కేసులో దంపతులకు పదేళ్ల జైలు

image

పెద్దాపురం మండలం జి.రాగంపేటలో జరిగిన హత్య కేసులో భార్యాభర్తలకు పదేళ్ల జైలుశిక్ష పడినట్లు సీఐ విజయశంకర్ తెలిపారు. 2022లో ఆదిన ప్రసాద్, అతని భార్య లక్ష్మి పాలాని కలిసి మంగను ఇంటి మెట్లపై నుంచి తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు పాపారాణి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పి. శివశంకర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.