News April 17, 2025
అచ్చంపేట: ‘వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి’

అచ్చంపేట పట్టణంలో గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
HYD: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 20, 2025
త్వరలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి

TGSRTCలో త్వరలో 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో డ్రైవర్ 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) 84, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) 114, డిపో మేనేజర్ 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) 23, సెక్షన్ ఆఫీసర్(సివిల్) 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ 7 పోస్టులున్నాయి.
News April 20, 2025
రాజమండ్రి: పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో ఉద్రిక్తత

పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన స్థలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కొవ్వొత్తులతో నివాళులర్పిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు హర్షకుమార్ను అదుపులోకి తీసుకుని జీపులో తీసుకెళ్లారు. క్రైస్తవులు, వివిధ సంఘాల నేతలు పాస్టర్ ప్రవీణ్కి నివాళులర్పించారు. పరిస్థితి ఉద్రిక్తత అవ్వడంతో నలుగురు నేతలను అదుపులోకి తీసుకుని రాజనగరం పోలీస్ స్టేషన్కు తరలించారు.