News February 21, 2025

అచ్చెన్న అబద్ధాలు చెప్పడం తగదు: ధర్మాన కృష్ణ దాస్

image

వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

Similar News

News April 24, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

ఉగ్రదాడిలో మన సిక్కోలు వాసి మృతి

image

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో సిక్కోలు వాసి మృతి చెందాడు. అతని కుటుంబం శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటోంది. SBIలో ఉద్యోగమొచ్చాక శ్రీకాకుళం నుంచి వెళ్లి విజయనగరంతో పాటు పలు ప్రాంతాల్లో చేశారు. బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ పొంది రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందట విశాఖలో స్థిర పడ్డారు. ఈనెల 18న మరో మూడు రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీలతో కలిసి పర్యాటకానికి వెళ్లి హతులయ్యారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన సిక్కోలు ఆణిముత్యాలు

image

నేడు విడుదలైన SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. 550 దాటిన మార్కుల్లో అమ్మాయిలదే పైచేయి. లావేరుకు చెందిన హరిత 600కి 592 మార్కులు వచ్చాయి. పలు మండలాల్లో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ ఎన్ పేట- 569( జాహ్నవి) , టెక్కలి- 577( లావణ్య), లావేరు-578( కుసుమ శ్రీ), రణస్థలం – 590(ఝాన్సీ) పది ఫలితాల్లో అదరగొట్టారు.

error: Content is protected !!