News August 21, 2024
అచ్యుతాపురం ఘటనపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్

అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 18మంది చనిపోయారని అధికారులు ఆయనకు వివరించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని సీఎం అన్నారు.
Similar News
News October 28, 2025
విశాఖ రానున్న మంత్రి గొట్టిపాటి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
News October 28, 2025
మూడసర్లోవ రిజర్వాయర్కు జలకళ

మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ప్రధాన జలాశయం ముడసర్లోవ జలకళను సంతరించుకుంది. ఈ జలాశయం సామర్థ్యం 170 అడుగులు కాగా.. మంగళవారం ఉదయం నాటికి 163 అడుగులకు నీరు చేరుకుంది. ఆదివారం 157 అడుగుల వరకు నీరు ఉండేది. సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో ఉంటే నీరు విడిచి పెట్టే అవకాశం ఉంది.
News October 28, 2025
అవసరమైతే బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. విశాఖలో 58 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. మేఘాద్రి గడ్డ దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలని కోరారు.


