News August 22, 2024
అచ్యుతాపురం: ఫార్మా కంపెనీపై కేసు నమోదు

అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంఘటనలో ఎసెన్షియా కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 40 మంది వరకు విశాఖ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News October 31, 2025
విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News October 31, 2025
గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.
News October 30, 2025
విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.


