News August 22, 2024
అచ్యుతాపురం: ఫార్మా కంపెనీపై కేసు నమోదు

అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంఘటనలో ఎసెన్షియా కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమారు 40 మంది వరకు విశాఖ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News January 19, 2026
విశాఖ వ్యాలీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2026
నేటి నుంచి ఏయూలో తరగతులు పున:ప్రారంభం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దాదాపు నెల రోజులపాటు విద్యార్థులకు సెలవులను ఇచ్చారు. పండుగ సెలవుల అనంతరం ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజులుగా బోధనేతర సిబ్బందికి సైతం పండగ సెలవులు లభించాయి దీంతో విశ్వవిద్యాలయం బోసిపోయింది. నేటి నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీ పనిచేస్తుంది.
News January 19, 2026
వణికిపోతున్న విశాఖ ప్రజలు

సాగర తీర ప్రాంతాలన్నీ మంచు తెరలతో నిండిపోయాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే పొగమంచు ధాటికి ప్రధాన రహదారులు ఏమాత్రం కనిపించడం లేదు. హనుమంతవాక హైవే, బీచ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 12-14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది.


