News February 7, 2025
అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయంలో బెల్లంపల్లి విద్యార్థికి సీటు

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో బెల్లంపల్లికి చెందిన ఆకునిరి రిషి చరణ్ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు. ఈ సందర్భంగా చరణ్ను బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సత్కరించారు. ఏసీపీ మాట్లాడుతూ.. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజీమ్ జీ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం బెల్లంపల్లి పట్నానికి గర్వకారణం అన్నారు.
Similar News
News December 8, 2025
తిరుపతి: నేడు కీలక కేసుల విచారణ

తిరుపతి వేదికగా సాగుతున్న పలు కీలక కేసులు సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టులో ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్, ఏ-29 సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది. మరో వైపు హై కోర్టులో పరకామణీ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
News December 8, 2025
TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ముందే తెలిసినా.!

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చినా వర్సిటీ వర్గాలు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశాయని పోలీసుల వర్గాల సమాచారం. శనివారం సాయంత్రం వర్సిటీ సిబ్బంది స్టేషన్కు వెళ్లి ‘నిందితుల ఫోన్లు తెచ్చాము, పరిశీలించండి’ అనడంతో పోలీసులు అవాక్కయ్యారట. ఫిర్యాదు చేస్తేనే విచారణ చేపడతామని వారు తెగేసి చెప్పడంతో వేరే దారి లేక ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


