News April 7, 2025

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవండి: వరంగల్ సీపీ

image

మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్  పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డ్‌ను అందజేశారు. పోలీస్ అధికారులు ఉన్నారు.

Similar News

News November 27, 2025

ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి నిఫ్టీ

image

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్‌ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.

News November 27, 2025

పార్టీలకు అస్త్రంగా మారిన గుంపుల చెక్ డ్యాం

image

తనుగుల చెక్ డ్యాం కుంగుబాటు ఘటనను ప్రధాన పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ ఆయా పార్టీల నేతలు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నాణ్యతాలోపం వల్లే అంటూ BJP నేతలు ఆరోపిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పటి ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణాలు చేసిందంటూ ఇటు CONG ఆరోపిస్తోంది.

News November 27, 2025

BREAKING.. కాళోజీ ఎగ్జామినేషన్ గది సీజ్!

image

డబ్బులు తీసుకొని <<18400179>>మార్కులు కలిపిన<<>> ఉదంతంపై చర్యలు చేపట్టారు. వరంగల్ ఎమ్మార్వో శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యా ఎగ్జామినేషన్ బ్రాంచ్ గదిని, కంప్యూటర్లను, స్కానర్లను సీజ్ చేశారు. నలుగురు పీజీ విద్యార్థుల రీకౌంటింగ్‌లో మార్కులు కలపాలని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది.