News March 11, 2025

అటవీ కళాశాలలో తేనెటీగల పెంపకంపై అవగాహన

image

ములుగు అటవీ కళాశాలలో రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అటవీ కళాశాలలో పరిశోధన సంస్థ సహకారంతో డాక్టర్ దీప ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేశారు. తేనెటీగల పెంపకం ప్రాసెసింగ్, మార్కెటింగ్, వ్యాధుల నివారణ చర్యలపై శిక్షణ అందించారు. డాక్టర్ పంకజ్ సింగ్, శాస్త్రవేత్త శ్రీకాంత్, డాక్టర్ శైలజ, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ సంజన పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

జగిత్యాల: గొర్రెపల్లి శివారులో వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగళారపు లక్ష్మీనర్సయ్య(43) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 12, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 12, 2025

పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

image

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.