News July 20, 2024

అటవీ గ్రామాలను చుట్టుముడుతున్న వాగులు

image

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చర్ల మండలంలోని గ్రామాలను వాగులు చుట్టు ముడుతున్నాయి. కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం చుట్టూ వాగులు కమ్మేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. కుర్నపల్లి-రామ చంద్రాపురం మధ్యలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ప్రభుత్వంగా ఉండాలని అధికారులు సూచించారు

Similar News

News December 17, 2025

ఖమ్మం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయింపు

image

ఖమ్మం జిల్లా రేషన్ లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి శుభవార్త తెలిపారు. రేపటి నుంచి 22 వరకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో బియ్యం లభిస్తాయని ప్రకటించారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించి, షాపులకు సరఫరా చేశామని తెలిపారు. లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల రేషన్ షాపుల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని కోరారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

image

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్‌వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

News December 17, 2025

ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.