News January 24, 2025

అడ్డగూడూరు:  డ్రోన్ ద్వారా బ్లడ్ శాంపిల్స్ 

image

అడ్డగూడూరు మం. చౌల్లరామరంలో 12 మంది టీబీ అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా పంపినట్లు వైద్యాధికారి భరత్ రాథోడ్ తెలిపారు. మొదట రామన్నపేట ఏరియా ఆసుపత్రికి, అక్క నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌‌కు పంపించామన్నారు. డ్రోన్ ద్వారా చేర్చడంతో త్వరగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్థులకు సకాలంలో మందులు అందజేయవచ్చన్నారు.  

Similar News

News December 2, 2025

జనగామ: 3 వార్డులకు ఎన్నికలు లేవు!

image

తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పత్రాల పరిశీలన కొనసాగుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో 3 వార్డులకు రిజర్వేషన్ల కారణంగా నామినేషన్లు దాఖలు కాలేదు. జనగామ జిల్లాలో రెండో విడతలో కూడా 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కానట్లు తెలుస్తోంది. మొత్తంగా 10 వార్డుల వరకు నామినేషన్లు రాలేదని సమాచారం.

News December 2, 2025

ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

image

AP: బీఈడీ క్వాలిఫికేషన్‌తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

News December 2, 2025

VKB: పంచాయతీ బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో..?

image

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ‘పంచాయతీ’ వేడెక్కింది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బరిలో నిలిచేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేయడం నేతలకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా ఒక్కరినే బరిలో దించేందుకు, నామినేషన్ల ఉపసంహరణకు నాయకులు బుజ్జగిస్తున్నారు. రేపటితో తొలివిడత బరిలో నిలిచేదెవరో.. తప్పుకునేదెవరో తేలనుంది.