News January 29, 2025
అడ్డాకుల: అనుమానాస్పద స్థితిలో యువకుడి సూసైడ్

అడ్డాకుల మండలం రాచాల (నాగయ్యపల్లి)కి చెందిన యువకుడు గద్దెగూడెం చెన్నయ్య(24) అనుమానాస్పద స్థితిలో మంగళవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చెన్నయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
News November 22, 2025
మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
News November 22, 2025
UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%


