News February 13, 2025
అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 28, 2025
RCBతో మ్యాచ్.. CSK స్టార్ ప్లేయర్ దూరం!

కాసేపట్లో ఆర్సీబీతో జరిగే కీలకమైన మ్యాచ్కు కూడా CSK స్టార్ బౌలర్ మతీషా పతిరణ దూరమయ్యారు. గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటించారు. MIతో మ్యాచ్లో ఆడిన జట్టును కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేలంలో రూ.13 కోట్లకు పతిరణను CSK సొంతం చేసుకుంది. గాయంతో తొలి మ్యాచ్కు అతను దూరమవగా రెండో మ్యాచ్కు అందుబాటులోకి వస్తారని ఫ్యాన్స్ భావించారు.
News March 28, 2025
మిడ్ డే మీల్కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 28, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.