News March 29, 2024

అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు సమీపంలో వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు టవల్ మెడకు బిగించి హత్య చేసినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కడల సాయిలు (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.

News February 16, 2026

NZB: మేయర్ ఉమారాణి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి నగరంలోని కసాబ్ గల్లికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. గర్ల్స్ హై స్కూల్ 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చేసిన ఆమె ఓపెన్‌లో BA పూర్తి చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజినీర్లు, మరొకరు MBA చేశారు. ఆమె భర్త కరాటే రమేశ్ అందరికీ సుపరిచతమే.

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.