News March 14, 2025

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు సంకల్పం: సంజయ్ కుమార్

image

యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉపాధికల్పన, శిక్షణశాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ హనుమంతరావు, ఉపాధి కల్పనాధికారి సాహితి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

చింతూరు: తవుడు బస్తాల మాటున గంజాయి రవాణా

image

చింతూరు మండలం ఎర్రంపేట సమీపంలో బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బొలెరో వాహనంలో క్రింద గంజాయి, పైన తవుడు బస్తాలు వేసి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన గంజాయి 120కిలోలు రూ.6లక్షలు ఉంటుందన్నారు. ఒరిస్సా మల్కాన్‌గిరికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

News November 20, 2025

Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

image

‘ఆపరేషన్ సిందూర్‌’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.

News November 20, 2025

సింగపూర్‌కి ప్రభుత్వ టీచర్లు పయనం.. ఏం చేయబోతున్నారంటే.?

image

సింగపూర్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు APకి చెందిన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సిద్ధమైంది. వీరు NOV 27-DEC 2 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, బోధనా పద్ధతులను వీరు పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు వీరు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ బృందం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పయనం కానుంది.