News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News December 1, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

image

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.

News December 1, 2025

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

image

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.

News December 1, 2025

HYD: రాజ్ భవన్.. లోక్ భవన్‌గా మారనుందా?

image

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్‌భవన్‌గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లోని రాజ్‌భవన్‌లు లోక్‌భవన్‌గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్‌భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.