News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News October 14, 2025

HYD: చీటీలు వేస్తున్నారా.. జర జాగ్రత్త..!

image

మాంగళ్య షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ తోటి ఉద్యోగులను చీటీల పేరిట మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. HYD బోరబండ హబీబ్ ఫాతిమా నగర్‌కు చెందిన బజ్జూరి రాంచందర్(47) హయత్‌నగర్ మునుగనూరులో ఉంటున్నాడు. 20 మందిని చీటీల పేరిట, ఇతరుల క్రెడిట్ కార్డ్స్‌తో రూ.30 లక్షలు వాడుకున్నాడు. పని మానేసి ఇల్లు ఖాళీ చేశాడు. బాధితుడు బుక్కి బాలకృష్ణ ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని సీఐ మహేశ్ తెలిపారు.

News October 14, 2025

జూబ్లీహిల్స్‌లో 1,500 నామినేషన్లు వేసేందుకు READY

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగలనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెసోళ్లు నిత్యం KCRను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా 1,000 మంది నిరుద్యోగులు, 300 మంది మాలలు, 200 మంది RRR రైతులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటమి సురుకు తగిలితేనే పని చేస్తుందని, లేదంటే ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తుందని వారు పేర్కొన్నారు.

News October 14, 2025

జూబ్లీహిల్స్‌‌లో దొంగ ఓట్ల ఆరోపణలపై ఎన్నికల అధికారి ప్రకటన

image

కొన్ని మీడియాలు, సోషల్ మీడియా వేదికల్లో జూబ్లీహిల్స్‌లోని కొన్ని ఇళ్లల్లో కావాలనే దొంగ, కొత్త ఓటర్లు చేర్చారన్న వార్తలను ఎన్నికల అధికారులు ఖండించారు. విచారణలో ఆ చిరునామాల్లోని ఓటర్లు ఇప్పటికే 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల తుది జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. కొత్తగా ఎవరూ నమోదు కాలేదని, కొన్ని ఇళ్లు భవనాలు కావడం వల్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.