News December 11, 2024
అత్తిలి: ‘మా అమ్మను బాగా చూసుకుంటాం’

అత్తిలి మండలం తిరుపతిపురం పంచాయతీ పరిధి శివపురానికి చెందిన సర్రమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వృద్ధాప్యంలో తోడుగా ఉండవలసిన కుమారులు పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మండల మెజిస్ట్రేట్ వంశీ ముందు మంగళవారం హాజరు పరచగా.. తనదైన శైలిలో కొడుకులు ఇద్దరికీ తహశీల్దార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అమ్మను బాగా చూసుకుంటామని కొడుకులు ఇద్దరు షూరిటీ ఇచ్చారు.
Similar News
News November 26, 2025
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News November 26, 2025
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News November 26, 2025
RRR కేసు.. ఐపీఎస్ పీవీ సునీల్కుమార్కు సిట్ నోటీసులు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


