News April 2, 2024
అత్యధికంగా ఖమ్మం మార్కెట్ రూ.2,761లక్షలు వసూలు

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తాజాగా లక్ష్యాన్ని మించి ఆదాయం నమోదైంది. ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎనిమిది మార్కెట్ల ద్వారా ఆదాయ లక్ష్యం రూ.5,439.72 లక్షలు కాగా, రూ.5,780.70 లక్షలు వసూలయ్యాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం మార్కెట్ నుంచి రూ.2,614 లక్షలకు రూ.2,761లక్షలు వసూలయ్యాయి. కాగా, గత ఏడాదితో పోలిస్తే మార్కెటింగ్ శాఖకు రూ.8లక్షల మేర ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 24, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
News February 24, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: సీఎస్

ఖమ్మం జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
News February 24, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.


