News February 12, 2025

అత్యధికంగా మంగపేట.. అత్యల్పంగా కన్నాయిగూడెం

image

ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 87 ఎంపీటీసీ, 10 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు, మల్లంపల్లిలో 25, వెంకటాపూర్-58, గోవిందరావుపేట-64, తాడ్వాయి-38, ఏటూరునాగారం-41, మంగపేట-77, వాజేడు-41, కన్నాయిగూడెం-21, వెంకటాపురం-54, ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

Similar News

News December 2, 2025

ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

image

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.

News December 2, 2025

నంద్యాల: హత్య కేసులో నలుగురి అరెస్ట్

image

నంద్యాలలో మేదరి పుల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడి ఆస్తులు, డబ్బులు కాజేయాలని కుట్ర పన్ని ధనుంజయ అనే వ్యక్తి సహచరులతో కలిసి పుల్లయ్యను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి, ఇంట్లో నుంచి DVRలు, ల్యాప్టాప్‌లను దొంగిలించారని చెప్పారు. ఈ కేసులో ధనుంజయ్, సంతోష్, రాఘవ, శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.

News December 2, 2025

ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

image

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.