News February 12, 2025

అత్యధికంగా మంగపేట.. అత్యల్పంగా కన్నాయిగూడెం

image

ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 87 ఎంపీటీసీ, 10 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు, మల్లంపల్లిలో 25, వెంకటాపూర్-58, గోవిందరావుపేట-64, తాడ్వాయి-38, ఏటూరునాగారం-41, మంగపేట-77, వాజేడు-41, కన్నాయిగూడెం-21, వెంకటాపురం-54, ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

Similar News

News December 8, 2025

ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్ష!

image

ఆదోని జిల్లా సాధనపై అన్ని వర్గాలు కదం తొక్కుతున్నాయి. నెల రోజులుగా నిరసనలు చేస్తూ జిల్లాతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యాలపై జిల్లా నేతలు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.