News February 12, 2025

అత్యధికంగా మంగపేట.. అత్యల్పంగా కన్నాయిగూడెం

image

ములుగు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 87 ఎంపీటీసీ, 10 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు, మల్లంపల్లిలో 25, వెంకటాపూర్-58, గోవిందరావుపేట-64, తాడ్వాయి-38, ఏటూరునాగారం-41, మంగపేట-77, వాజేడు-41, కన్నాయిగూడెం-21, వెంకటాపురం-54, ములుగు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.

Similar News

News October 22, 2025

NRPT: బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలి

image

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు. 2015 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 13 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా, 3 కేసులు ఛార్జ్‌షిట్ దశలో ఉన్నాయన్నారు.

News October 22, 2025

NMLలో 21 పోస్టులు

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nml.co.in

News October 22, 2025

హీరో నారా రోహిత్ పెళ్లి తేదీ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుకలు!

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నటి, ప్రియురాలైన శిరీషను ఈనెల 30న రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. 26న పెళ్లి కొడుకు వేడుక, 28న మెహందీ, 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.