News March 18, 2025

అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

image

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.

Similar News

News December 7, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌‌లోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో 50 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MBBS, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,60,226, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 7, 2025

సర్పంచ్‌గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

image

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It

News December 7, 2025

నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

image

నూజివీడులో ట్రిపుల్ ఐటీ‌లో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.