News February 20, 2025

అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లాకు 2 పతకాలు

image

ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రెండు పతకాలు సాధించారు. కొండపాక సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన నగేష్ అండర్- 20 బాలుర విభాగం జావెలిన్ త్రో లో వెండి పతాకం, మెరీడియన్ పాఠశాల చెందిన సిరి చందన అండర్-16 బాలికల షాట్ పుట్‌లో కాంస్య పతాకం సాధించారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ తెలిపారు.

Similar News

News November 26, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేనెల 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను SP ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు DSP శ్రావణ్ కుమార్‌తో కలిసి హెలిపాడ్ ప్రాంతం, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంతం, పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.

News November 26, 2025

తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News November 26, 2025

కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

కదిరి టౌన్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.