News November 12, 2024

అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కడప కలెక్టర్

image

ఆధార్ నమోదు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే సర్వీసు ఛార్జీలను చెల్లించాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు. జిల్లాలో ఆధార్ సేవల నిర్వహణపై సోమవారం జేసీ అదితి సింగ్, ఆర్డీవోలు జిల్లాలోని పలు ఆధార్ సేవ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆధార్ సేవాకేంద్రాల్లో సేవలు అందించాలన్నారు.

Similar News

News December 4, 2025

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

image

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.

News December 4, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.