News July 25, 2024

అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు

image

అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణం అనుకూలించడంతో పొగాకు అధికంగా ఉత్పత్తి అయ్యిందని, గతంలో కూడా జరిమానా తొలగించి కొనుగోలు చేసినట్లు ఆయనకు వివరించారు. సదరు విషయంపై కేంద్ర మంత్రి అధికారులతో మాట్లాడి పెనాల్టీ రద్దుకు ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News November 16, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.