News April 2, 2025

అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

image

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.

Similar News

News November 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 72

image

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడితో పోరాటం చేస్తున్నప్పుడు, కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 20, 2025

PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్(PDIL)లో 87 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.pdilin.com

News November 20, 2025

గేదెలతో డెయిరీఫామ్ ఎందుకు భారమవుతోంది?

image

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలకు రెట్టింపు ధర వస్తుంది. అయితే స్థానిక గేదె జాతుల్లో పాల దిగుబడి తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు పాడి రైతులు. గేదెలు సకాలంలో ఎదకు రాకపోవడం, మూగ ఎద లక్షణాలు ఎక్కువగా ఉండటం, ఎక్కువ పాల దిగుబడినిచ్చే ముర్రా జాతి గేదెలు అధిక ధర ఉండటం.. అంత ధరపెట్టి కొన్నా మన వాతావరణంలో అవి ఎక్కువ పాలివ్వడకపోవడం, ఎద విషయంలో సమస్యల కారణంగా ఫామ్ నిర్వాహకులు నష్టపోతున్నారు.