News June 7, 2024
అద్దంకిలో భారీ చోరీ

అద్దంకిలోని ఆయిల్ మిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం, రూ.2.25 లక్షలు నగదు, 3 రకాలైన డైమండ్స్ను దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెల్లం రాజేశ్ ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుండగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. ఇంటి యజమాని తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రాజేశ్కి సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 20, 2025
ప్రకాశం: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 20, 2025
ప్రకాశం: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 20, 2025
సాగర్ కవచ్కు 112 మంది పోలీసుల కేటాయింపు

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.


