News March 8, 2025
అద్దంకిలో వ్యక్తి ఆత్మహత్య

తిమ్మాయిపాలెంకు చెందిన కోటేశ్వరరావు(37) ఇంట్లో ఉరివేసుకొని మరణించాడు. అద్దంకి S.I ఖాదర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రోజువారి కూలి పనులు చేసే కోటేశ్వరరావు వివిధ ఫైనాన్స్ కంపెనీలలో అప్పు తీసుకున్నాడు. అదే సమయంలో తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మానసికంగా కృంగిపోయి శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని మరణించినట్లు భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2025
ఇస్రో షార్లో 141 పోస్టులు.. అప్లై చేశారా?

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 141 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, ITI, టెన్త్, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, బీఎల్ఎస్సీ, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: www.isro.gov.in/
News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చే పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.
News November 11, 2025
నేడు ఘట్కేసర్లో అందెశ్రీ అంతక్రియలు.!

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ అకాల మరణం రాష్ట్ర ప్రజల గుండెలను కలచివేసింది. అందెశ్రీ పాడిన పాట, తెలంగాణ కోసం రాసిన రాతలతో పోరాట స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని ముందుకు నడపడంలోనూ కీలక భాగమయ్యారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం పట్ల తెలంగాణ పోరాట యోధులు శోకసంద్రంలో మునిగారు. నేడు ఆ మహానీయుడు అంతక్రియలు ఘట్కేసర్లో జరగనున్నాయి.


