News April 5, 2024

అద్దంకిలో 21 మంది వాలంటీర్లు రాజీనామా

image

అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.

Similar News

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

News December 5, 2025

MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News December 5, 2025

MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.